చీరాల : ఆంద్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 147వ జయంతిని పేరాల ఎఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించారు. పాఠశాల ప్రదానోపాద్యులు బి సాల్మన్ ప్రకాశంపంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యసరచన, డ్రాయింగ్ పోటీలు విద్యార్ధులకు నిర్వహించారు. విజేతలైన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, ఎరిచర్ల గాంధీ, ఫ్రాన్సిస్, శివప్రసాద్, రమణ, సురేష్, సుశీల, మధు, రాజ్యలక్ష్మి, బషీరా, సుశాంతి, శేఖర్, సునీత పాల్గొన్నారు.