పర్చూరు : సీఎం చంద్రబాబుకు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ భారత మాత ‘బ్రాండ్’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ అని అన్నారు. చంద్రబాబు జీవితం అందరికీ ఆదర్శం కావాలని అన్నారు. ఆయన మార్గదర్శకత్వం, జ్ఞానం, అచెంచలమైన నిబద్ధత తమకు స్ఫూర్తి అన్నారు. ప్రజాసేవ, ప్రగతి బాటలో అలుపెరగని యోధుడు చంద్రన్న అని అన్నారు. 75ఏళ్ల వయసులో నవ యువకుడిలా చంద్రబాబు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు లక్ష్యంగా చంద్రబాబు అనునిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. రోజుకు 18 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.
ఎపి అభివృద్ధి లక్ష్యంగా ఆలోచనలతోనే నవ్యాంధ్ర వెలుగుతుందని అన్నారు. రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పోలవరం నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకున్న తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కరువు రహిత రాష్ట్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన లక్ష్యం అన్నారు. పేదలను సంపన్నులుగా చేయడమే లక్ష్యంగా అడుగులు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబని పేర్కొన్నారు. 2047 నాటికి పేదరికం నిర్మూలించడమే లక్ష్యంగా ప్రణాళికలు చేశారని తెలిపారు. జీరో పావర్టీ- పి4 పాలసీకి రాష్ట్రంలో అనూహ్యస్పందన వస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి అడుగు విజయహారమేనని కొనియాడారు.
మార్టూరు : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు తెలుగు యువత అధ్యక్షుడు ఫరూక్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదినం సందర్భంగా మార్టూరులోని వెంకయ్య, అమ్మ ఆశ్రయంలో అన్నదానం, దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్టూరు తెలుగుదేశం నాయకులు పల్లపాటి విజయ్, డి రామకృష్ణ, పచ్చవ అరుణ్ కుమార్, ముస్లిం మైనార్టీ నాయకులు పసుమర్తి కరిముల్లా, మందపాటి అంజయ్య, అట్లూరి ఏసు పాదం, నాగూరు, ఆశిక్, నజీర్ పాల్గొన్నారు. వలపర్ల, పూనూరు, గంగవరం, కడవకుదురు, ఇడుపులపాడు, చిమ్మిరిబండ, జరుబులువారిపాలెం, కారంచేడు, దగ్గుబాడు, యద్దనపూడి, వింజనంపాడు, చిన్నగంజాం, పెద్దగంజాం, అనంతవరం, గన్నవరం, నాగులపాలెం గ్రామాల్లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేకులు కట్ చేసి పంచిపెట్టారు.
పర్చూరు : బొమ్మల సెంటర్లో ఆంధ్రుల ఆరాధ్య దైవం, నవ్యాంధ్ర రూపుకర్త చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం సెంటర్లో అన్నదానం ఏర్పాటు చేశారు.