Home బాపట్ల పేదల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు : ఎంఎల్‌ఎ కొండయ్య

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు : ఎంఎల్‌ఎ కొండయ్య

47
0
Oplus_16908288

చీరాల : ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా నడిపిస్తున్నారని శాసన సభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు పట్టణంలో ఘనంగా జరిపారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నుండి గడియార స్థంభం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టిడిపి, జనసేన, బిజెపి నేతలు కలిసి చంద్రబాబు పుట్టినరోజు కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు. అనంతరం కొండయ్య మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో అంధకారంలో ఉన్న ఎపిలో వెలుగులు నింపేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

75ఏళ్ల వయసులో కూడా 20ఏళ్ల యువకునిలా చంద్రబాబు ప్రజల కోసం 18 గంటలు పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పోలవరం, రాజధాని నిర్మాణం పూర్తవుతాయని అన్నారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీతో టీచర్ల నియామకం చేపడతామని నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని అన్నారు. 2025లో పాఠశాలలు తెరవడానికి ముందే టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీమేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు. సిఎం చంద్రబాబు, లోకేష్ ఇద్దరి మాటలను నిలబెడుతూ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన చేసిందని అన్నారు. ఇచ్చిన మాటకు తెలుగుదేశం కట్టుబడి ఉంటూ ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధనరావు, టిడిపి
పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను, సయ్యద్ బాబు పాల్గొన్నారు