Home జాతీయం Former Karnataka police chief dgp om Prakash found dead: మాజీ డిజిపి హత్య

Former Karnataka police chief dgp om Prakash found dead: మాజీ డిజిపి హత్య

59
0

కర్ణాటక : ఇటీవల సమాజంలో భార్యలు రెచ్చిపోతున్నారు. భర్తలను టార్చర్ పెడుతున్నారు. ఒకప్పుడు భర్తలు భార్యల్ని వేధించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. భార్యలు భర్తలను టార్చర్ పెట్టడమే కాకుండా.. తమ వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తే చంపేయడానికి కూడా అస్సలు వెనక్కు రావడం లేదు.

ఇప్పటికే ఎంతో మంది టెకీలు, ఉద్యోగులు భార్యల వేధింపులు భరించలేక వీడియోలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఏకంగా మాజీ డీజీసీ తన నివాసంలో అత్యంత ఘోరంగా పదునైన ఆయుధాలతో దాడికి గురై చంపబడ్డాడు. ఈ ఘటన పోలీసు శాఖను షాక్‌కు గురిచేసేదిగా మారింది.

1981 బ్యాచ్‌కు చెందిన ఓంప్రకాశ్ 2015లో కర్ణాటక రాష్ట్రానికి 38వ డీజీ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని తన నివాసం హెచ్ఎస్ఆర్ లే అవుట్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో కానీ ఆయన దారుణంగా చంపడ్డారని ఆదివారం సాయంత్రం 4 నుంచి 4.30 ల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది.

వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా అప్పటికే పదునైన ఆయుధాలు, రక్తపు మడుగులో మాజీ డీజీపీ ఓంప్రకాష్ విగత జీవిగా పడి ఉన్నారు. ఆయనను వైద్యులు చూసిన తర్వాత చనిపోయాడని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే.. ఈ ఘటన తర్వాత పోలీసులు డీజీపీ భార్యను, ఆయన కూతురిని అదుపులోకి తీసుకున్నారు.