Home ఉపాధి మ‌హిళా క‌ళాశాల ప్రాంగ‌ణ ఎంపిక‌ల్లో 16మంది ఎంపిక‌

మ‌హిళా క‌ళాశాల ప్రాంగ‌ణ ఎంపిక‌ల్లో 16మంది ఎంపిక‌

365
0

చీరాల : చాక్లెట్ త‌యారీ కంపెనీ క్యాడ్బ‌రీ ఇండియా లిమిటెడ్ కంపెనీ చీరాల ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో శ‌నివారం నిర్వ‌హించిన ప్రాంగ‌ణ ఎంపిక‌ల్లో 16మంది విద్యార్ధులు ఉద్యోగాల‌కు ఎంపికైన‌ట్లు క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సిహెచ్ ర‌మ‌ణ‌మ్మ తెలిపారు. క‌ళాశాల జెకెసి ఆధ్వ‌ర్యంలో ఎంపిక‌లు నిర్వ‌హించారు. 86మంది విద్యార్ధులు ఎంపిక‌ల‌కు హాజ‌రు కాగా మొద‌టిగా ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించిన అనంత‌రం ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వ‌హించారు. వీరిలో 40మంది ఇంట‌ర్వూల‌కు ఎంపికైన‌ట్లు తెలిపారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారికి ఎల్ల‌ప్పుడూ మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ప్రిన్సిపాల్ ర‌మ‌ణ‌మ్మ అన్నారు. కార్య‌క్ర‌మంలో జెకెసి కోఆర్డినేట‌ర్ కె చంద్ర‌శేఖ‌ర్‌, ఎస్వీ సుబ్బారెడ్డి, సెల‌క్ష‌న్ టీమ్‌కు స‌హ‌క‌రించారు. ఇంట‌ర్వూల్లో 16మంది ఉద్యోగాల‌కు ఎంపికైన‌ట్లు తెలిపారు.