ఒంగోలు : చీరాల పట్టణంలోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ వస్త్ర వ్యాపారులు తమ సమస్యలను శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి సమక్షంలో యువనేత కరణం వెంకటేష్ బాబుతో కలసి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కు వివరించారు. లాక్ డౌన్ తో వ్యాపారాలు నిలిచిపోవడంతోపాటు తమపై ఆధారపడిన గుమాస్తాలు కూడా పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు.