Home ప్రకాశం అమృతపాణి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

    అమృతపాణి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

    0
    0

    చీరాల : వైసిపి నేత డాక్టర్ అమృతపాణి ఆధ్వర్యంలో జగన్ పై జరిగిన దాడికి నిరసనగా చీరాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన జగనన్నను ఏమి చెయ్యలేరని అన్నారు. చేతగాని ప్రభుత్వం కోట్లాది గుండెల్లో ఉన్న ప్రజా నాయకుడికే భద్రత కల్పించకపోతే ప్రజలకు ఏమి భద్రత కల్పిస్తారని అమృతపాణి ప్రశ్నించారు.

    ర్యాలీలో కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, న్యాయవాది కర్నేటి రవి, రాజకుమార్, ఐస్వామి, పేర్లి నాని పాల్గొన్నారు.