Home విద్య పోలవరం సందర్శనకు సెయింట్ ఆన్స్ సివిల్ విద్యార్థులు

పోలవరం సందర్శనకు సెయింట్ ఆన్స్ సివిల్ విద్యార్థులు

413
0

చీరాల : ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టుల్లో పోలవరం జలవనరుల ప్రాజెక్టు ప్రధానమైనది. అక్కడి నిర్మాణం ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగిన ప్రాజెక్టును సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు చూపడం ద్వారా విద్యార్థులకు భారీ ప్రాజెక్టుల నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం టూర్ ఏర్పాటు చేసింది. చీరాల ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సుల్లో విద్యార్థులు, సివిల్ విభాగం అధ్యాపకులు బయలుదేరి వెళ్లారు. ఒక్కరోజు టూర్లో ప్రాజెక్టు నిర్మాణం, కాలువలు, అనుబంధ పనులు విద్యార్థులకు వివరించనున్నట్లు సివిల్ హెచ్ఓడి తెలిపారు.