అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా అనిల్ చంద్ర పునీత శుక్రవారం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీసీఎల్ఏగా పనిచేస్తున్నారు. ఏడాది పాటు ఏపీ సీఎస్గా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా పునీత సీఎం చంద్రబాబును కలిశారు. తనను సీఎస్గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.