అమరావతి : మే 2న అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని అన్నారు. ఇన్ఛార్జి మంత్రుల పర్యటనల్లో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలన్న చెప్పారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం తదితర అంశాలు పరిష్కరించాలని అన్నారు. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.