చీరాల : మండలంలోని పాతచీరాల గ్రామంలో వీర్లంకమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి మాజీ ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజ అనంతరం భక్తులకు అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో వీర్లంకమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.