పర్చూరు : కొత్తపాలెం గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఇసుక దర్శిలోని తన క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ పాలపర్తి బూసిరెడ్డి, కొమరగిరి చెంచయ్య తోపాటు పలువురు గ్రామస్తులు ఆయనను మర్యాదపూర్వం మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామంలో సమస్యలను దశలవారిగా పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి కొత్తపాలెం గ్రామ సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామంలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, స్కూల్ కాంపౌండ్ నిర్మాణం చేపడతామని అన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.