Home విద్య ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల త‌నిఖీ

ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల త‌నిఖీ

355
0

చీరాల : ప‌ట్ట‌ణంలోని వివిధ పాఠ‌శాల‌ల్లో జ‌రుగుతున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ ప్ర‌తినిధులు సోమ‌వారం ప‌ర్య‌వేక్షించారు. పేరాల శ్రీ‌సాయి హైస్కూల్‌, ర‌వీంద్ర స్కూల్‌, కెజిఎం బాలికోన్న‌త పాఠ‌శాల‌, భాష్యం హైస్కూల్‌, శ్రీ‌గౌత‌మి హైస్కూల్‌, గాయ‌త్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జ‌రుగుతున్న ప‌దోత‌ర‌గ‌తి గ‌ణితం ద్వితీయ పేప‌ర్ ప‌రీక్ష‌ను ప‌రిశీలించారు.

విద్యార్ధుల మార్కుల జాబితా నిర్వ‌హ‌ణ‌, విద్యార్ధులు కూర్చునే ఏర్పాట్లు, ప‌రీక్ష‌ల ప‌ర్య‌వేక్ష‌కుల జాబితాలు ప‌రిశీలించి సూచ‌న‌లు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేర‌కు పాఠ‌శాల అంత‌ర్గ‌త మార్కుల‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు, నోటు పుస్త‌కాలు సిద్దం చేయాల‌ని సూచించారు. త‌నిఖీల్లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ క‌మిటి స‌భ్యులు ఆర్‌వి ర‌మ‌ణ‌, కె వీరాంజ‌నేయులు, పి భానుచంద్ర‌మూర్తి, వై య‌ల్ల‌మందేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.