Home క్రీడలు సిఎం క‌ప్ రాష్ట్ర స్థాయి జ‌ట్టుకు ఎంపికైన కొత్త‌పేట జెడ్‌పి స్కూల్ విద్యార్ధులు

సిఎం క‌ప్ రాష్ట్ర స్థాయి జ‌ట్టుకు ఎంపికైన కొత్త‌పేట జెడ్‌పి స్కూల్ విద్యార్ధులు

420
0

చీరాల : త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న సిఎం క‌ప్ రాష్ట్ర‌స్థాయి ఆట‌ల పోటీల జ‌ట్టుకు కొత్త‌పేట జెడ్‌పి ఉన్న‌త పాఠ‌శాల విద్యార్ధులు ఎంపికైన‌ట్లు పాఠ‌శాల ప్రిన్సిపాల్ ఎస్ ఇందిరా ఇజ్రాయేల్ తెలిపారు. ఫుట్‌బాల్ జ‌ట్టుకు విక్ట‌ర్‌శిల్వ‌రాజ్‌, ఎం సూర్య‌ప్ర‌కాష్‌, స‌ప‌క్ ట‌క్రా అండ‌ర్ 14జ‌ట్టుకు మిచ‌ల్‌, సంతోష్‌, అండ‌ర్ 17జ‌ట్టుకు జాన్‌ప్ర‌సాద్‌, ఫెన్సింగ్ జ‌ట్టుకు ఎస్ శ్రీ‌ధ‌న్‌, ఎస్ శ్రీ‌మ‌న్ ఎంపికైన‌ట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి, తూర్పగోదావ‌రి జిల్లా ఏలూరు, నెల్లూరు జిల్లా కొవ్వూరులో రాష్ట్ర‌స్థాయి పోటీలు జ‌రుగుతాయ‌ని తెలిపారు. ఎంపికైన విద్యార్ధుల‌ను పాఠ‌శాల ఉపాధ్యాయులు ఎస్‌జిడి ఖురేషి, పిడి వెంక‌ట్రావు, ర‌వీంద్ర‌, హ‌నుమంత‌రావు, సిఆర్‌పి సుజాత అభినందించారు.