Home ఉపాధి వైఎ ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో జాబ్‌మేళా

వైఎ ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో జాబ్‌మేళా

442
0

చీరాల : యార్ల‌గ‌డ్డ అన్న‌పూర్ణాంబ ప్ర‌భుత్వ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో ఈనెల 22న జెకెసి ఆధ్వ‌ర్యంలో క్యాడ్బ‌రీ ఇండియా లిమిటెండ్‌, శ్రీ‌సిటీ జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సిహెచ్ ర‌మ‌ణ‌మ్మ తెలిపారు. క‌ళాశాల జెకెసి కోఆర్డినేట‌ర్ కె చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వ‌చ్చేవారి అర్హ‌త‌ల‌ను, ఇత‌ర వివ‌రాల‌ను తెలిపారు. 50శాతం మార్కుల‌తో ఇంట‌ర్ పాస్‌, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అయిన‌వారు అర్హుల‌ని తెలిపారు. అల‌వెన్సుల‌తో క‌లిపి రూ.14వేల వేత‌నం ఉంటుంద‌న్నారు. 150ఖాళీలు ఉన్న‌ట్లు తెలిపారు. 18నుండి 25ఏళ్ల‌లోపు మ‌హిళ‌లు మాత్ర‌మే అర్హుల‌న్నారు. చిత్తూరు జిల్లా శ్రీ‌సిటీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంద‌ని, వివ‌రాల‌కు 81211 58929, 87540 48632నంబ‌ర్ల‌లో సంప్ర‌దించాల‌ని కోరారు.