చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎంసిఎ విద్యార్ధులు జాతీయ స్థాయి పేపర్ ప్రజెంటేషన్, టెక్నికల్ క్విజ్లో ప్రధమ, ద్వితీయ బహుమతులను సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఒంగోలు రైజ్ కృష్ణ సాయి ఇంజనీరింగ్ కాలేజీలో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం ప్యూజన్ – 2కె18 పోటీల్లో తమ కళాశాల ఎంసిఎ విద్యార్ధులు పేపర్ ప్రజెంటేషన్లో మొదటి, ద్వితీయ బహుమతులు, టెక్నికల్ క్విజ్లో మొదటి, ద్వితీయ బహుమతులు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు.
పేపర్ ప్రజెంటేషన్లో పి పవన్కుమార్, కె ఆనంద్కుమార్ మొదటి బహుమతి, ఎస్కె రేష్మాబేగమ్, జి ఆషాజ్యోతి ద్వితీయ బహుమతి, టెక్నికల్ క్విజ్ పోటీలలో ఎం శిరీష, వి పావని, యు ప్రశాంతి, జి వినీత జట్టు మొదటి బహుమతి, పి పవన్కుమార్, ఎన్ గోపిరాజు, కె ఆనంద్కుమార్, జె నరసింహం జట్టు ద్వితీయ బహుమతి సాధించినట్లు ఎంసిఎ హెచ్ఒడి డాక్టర్ సి హరికిషన్ తెలిపారు. బహుమతులు సాధించిన విద్యార్ధులను అభినందించారు.