Home విద్య పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్‌లో సెయింట్ ఆన్స్ విద్యార్ధికి ద్వితీయ బ‌హుమ‌తి

పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్‌లో సెయింట్ ఆన్స్ విద్యార్ధికి ద్వితీయ బ‌హుమ‌తి

338
0

చీరాల : పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్‌, పోస్ట‌ర్ ప్ర‌జెంటేష‌న్ పోటీల్లో త‌మ విద్యార్ధులు ద్వితీయ బ‌హుమ‌తి సాధించార‌ని సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల సెక్ర‌ట‌రీ వ‌న‌మా రామ‌కృష్ణారావు, క‌ర‌స్పాండెంట్ ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు, ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి ర‌వికుమార్ తెలిపారు.

చీమ‌కుర్తిలోని బూచేప‌ల్లి వెంకాయ‌మ్మ‌, సుబ్బారెడ్డి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన జాతీయ స్థాయి టెక్నోక‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ టెక్ ధ‌రానా 2కె18 లో పోస్ట‌ర్ ప్ర‌జెంటేష‌న్‌లో జి వెంక‌టేష్ ఆర్గానిక్ లైట్ ఎమిష‌న్స్ డ‌యోడ్ డిస్‌ప్లే టెక్నిక్స్‌లో ద్వితీయ బ‌హుమ‌తి, ఒంగోలు రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూష‌న్స్‌లో జరిగిన జాతీయ స్థాయి టెక్నిక‌ల్ సింపోజియం ఫ్యూజ‌న్ 2కె18లో క్వాంట‌మ్ టెలి ఫోర్‌టేష‌న్‌పై పి ర‌విచంద్ పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్‌లో ద్వితీయ బ‌హుమ‌తి సాధించిన‌ట్లు ఇసిఇ హెచ్ఒడి డాక్ట‌ర్ కె జ‌గ‌దీష్‌బాబు తెలిపారు.

జాతీయ స్థాయి సెమినార్ల‌లో బ‌హుమ‌తులు సాధించిన విద్యార్ధుల‌ను క‌ళాశాల అధ్యాప‌క‌, అధ్యాప‌కేత‌ర సిబ్బంది, మేనేజ‌ర్ ఆర్‌వి ర‌మ‌ణ‌మూర్తి అభినందించారు.