Home విద్య ధాత్రి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో విద్యార్ధుల‌కు నోటు పుస్త‌కాలు పంపిణీ

ధాత్రి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో విద్యార్ధుల‌కు నోటు పుస్త‌కాలు పంపిణీ

693
0

చీరాల : ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన నోటుపుస్తకాల పంపిణీ సందర్భంగా జరిగిన సభలో ప్రధానోపాధ్యాయులు కె వీరాంజనేయులు మాట్లాడారు. పూర్వం ఇదే స్కూల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండి పది మంది ఒక ఫౌండేషన్ ఏర్పాటు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆ ఫౌండేషన్ ద్వారా స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సాయం చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దాతల సహకారంతో మేము ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయటం జరుగుతుందని చెప్పారు. ఒక స్కూలుతో ప్రారంభించింది ఇరవై నాలుగు స్కూళ్లల్లో నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తమకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గిరి కుమార్, వంశీకృష్ణ, శ్రీమన్నారాయణ, రాంబాబు, నాని, ఉపాధ్యాయులు భారతి, సత్యనారాయణ, శ్రీనివాసరావు, సుధారాణి, భవానీ, అనూష, అంజిరెడ్డి, రామిరెడ్డి పాల్గొన్నారు.