Home ప్రకాశం పోలీస్ అధికారులకు నగదు రివార్డులు

పోలీస్ అధికారులకు నగదు రివార్డులు

416
0

ప్రకాశం : సింగరాయకొండ సిఐ టిఎక్స్ అజయ్ కుమార్, టంగుటూరు ఎస్ఐ వైవి రమణయ్యలకు ఒంగోలు కోర్టు రివార్డ్ ప్రకటించింది. ఈ నెల 24న తూర్పునాయుడు పాలెంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడిచేసి 11మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేశారు. పేకాట రాయుళ్ల వద్ద నుండి రూ.8,61230 నగదును, 16మొబైల్ ఫోన్లు, 4 మోటారు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను ఒంగోలు కోర్ట్ లో హాజరుపరచగా సింగరాయకొండ సిఐ అజయ్ కుమార్ ను, టంగుటూరు ఎస్ఐ రమణయ్యలను అభినందిస్తూ ఇరువురికి రూ.3,30,000 నగదు రివార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశిల్ అభినందించారు.