పర్చూరు : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నిటిలో అగ్రగామిగా నిలిచాడు. ఇక్కడ కూడా వెనుకబాటులో లేరు. తన దగ్గర ఉన్న రిపోర్టులలో సమర్థవంతతను నిరూపించుకున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. క్లస్టర్ యూనిట్, బూతులు ర్యాంకింగ్లో పర్చూరు మూడో స్థానంలో నిలిచిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. లీడర్షిప్ స్ట్రాంగ్ గా తయారుచేసి పర్చూరును కంచుకోటగా మార్చాడని కితాబ్ ఇచ్చారు.
సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తామని, పేదరికం నిర్మూలనకే పీ4 విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలే ముందు ఆ తర్వాతే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు.