Home ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్నం ఆధ్వర్యంలో ర్యాలీ

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్నం ఆధ్వర్యంలో ర్యాలీ

401
0

బాపట్ల : కేంద్ర ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా తెలుగుదేశం ఆధ్వర్యంలో బాపట్లలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టిడిపి పట్టణ అధ్యక్షులు తానికొండ దయబాబు మాట్లాడుతూ నరేంద్రమోడీ ఆంద్రప్రదేశ్ ను ఒక శత్రు దేశంగా చూస్తూ, దేశానికి ప్రధాన మంత్రిగా కాకుండా కేవలం గుజరాత్ రాష్ట్రానికి ప్రధాన మంత్రిగా వ్యహరిస్తున్నాడని ఆరోపించారు. మోడీ ఒక నియంతలా వ్యవహరిస్తూన్నాడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణకు పాటు పడాలని కోరారు.

మున్సిపల్ చైర్మన్ తోటా మల్లీశ్వరి మాట్లాడుతూ దుష్ట త్రయమైన మోడీ, పవన్, జగన్ లకు రాష్ట్ర ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అనంతర మహాత్మా గాంధీ, డా౹౹ బిఆర్ అంబేద్కర్ విగ్రహలకు వినతిపత్రం అందజేశారు.