చీరాల : జాన్ద్రపేట శ్రీబాలానందం ట్రస్ట్ ఆధ్వర్యంలో మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాడ్ ఉన్ నబి పండుగ సందర్భంగా ముస్లిం మహిళలకు చీరలు బుధవారం పంపిణీ చేశారు. వందల మంది ముస్లిం మహిళలు ఖురాన్ పఠనం చేశారు. మహ్మద్ ప్రవక్త చెప్పిన శాంతి సందేశాన్ని వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సజ్జా వెంకటేశ్వరరావు, చీరాల, వేటపాలెం జెడ్పిటిసిలు పృథ్వి అరుణ, కొమరగిరి విజయ, కొఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, ఎంపిటిసి కట్ట గంగయ్య, సాల్మన్ సెంటర్ మాజీ సర్పంచ్ అడపా వెంకటేశ్వర్లు, మతపెద్దలు పాల్గొన్నారు.