చీరాల : దళిత తేజం – తెలుగుదేశం కార్యక్రమాన్ని చీరాల మండలం తోటావారిపాలెం ఎస్సి కాలనీలో మంగళవారం నిర్వహించారు. టిడిపి నాయకులు కాలనీలో పర్యటించి ప్రభుత్వం దళితుల అభివృద్దికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కాలనీల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కలిస్తున్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షులు బుర్ల మురళి పాల్గొన్నారు.