చీరాల : ఆంద్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నాగుపాలెం ఎపి రెడిడెన్షియల్ స్కూల్ విద్యార్ధులకు గత పదిరోజులుగా ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిసినట్లు సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు.
40మంది విద్యార్ధులకు కళాశాల ఆవరణలోని రాష్ట్రప్రభుత్వ శిక్షణా కేంద్రంలో ఈనెల 9నుండి 18వరకు శిక్షణ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. శిక్షణ పొందిన విద్యార్ధులకు దృవీకరణ పత్రాలు ఇచ్చినట్లు శిక్షణా కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ తెలిపారు. కార్యక్రమంలో ట్రైనర్ ఎస్కె బాజి పాల్గొన్నారు.