టంగుటూరు : కరోనా వైరస్ విపత్తుతో లాక్ డౌన్ విధించడం వలన గ్రామంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఆదాయపు పన్నుశాఖ అధికారి కురుగుంట్ల సెల్వన్ రాజు ఆధ్వర్యంలో ఆశాలత మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 4000 కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా సెల్వన్ రాజు మాట్లాడుతూ ఆశాలత మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్19తో లాక్ డౌన్ కారణంగా ఉపాదిలేక ఎందరో దినసరి కూలీలు, భవన నిర్మాణ కూలీలు, పొగాకు కూలీలు, చిరు వ్యాపారులు, ఇతరత్రా పనులు చేసుకుని జీవించే ఎందరో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయూతగా నిత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆదాయపు పన్నుల శాఖ అధికారి బొడ్డు వెంకటేశ్వర్లు, గ్రామంలోని అన్ని ప్రాంతాల యువకులు పాల్గొన్నారు.