చీరాల : కెజిఎం బాలికోన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల సముదాయ ఛైర్మన్ పి వెంకటేశ్వరబాబు అధ్యక్షతన సైన్స్ ఉపాధ్యాయులు సమావేశం బుధవారం నిర్వహించారు. పాఠశాలల వారీగా ప్రగతి సమీక్షించారు. పాఠ్యాంశాల బోధన, పుస్తక సమీక్ష చేశారు. రిసోర్స్ పర్సన్లుగా టివి రావు, మన్నవ మురళీకృష్ణ, పి భానుచంద్రమూర్తి వ్యవహరించారు.
సైన్స్ఫేర్, ఇన్స్స్పైర్, సైన్స్ నాటకాలు వంటి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, సిసిఆర్టి ట్రైనింగ్ వివరాలు చర్చించారు. పదకోశాలు ఎలా నిర్మించాలి, వివిధ శాస్ర్తాల డిక్షనరీలను విద్యార్ధులకు పరిచయం చేయాలని సూచించారు.