చీరాల : కొత్తపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సె మీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ తాత వేషదారులకు హెచ్ఎం ఇందిరా ఇజ్రాయిల్ కేక్ తినిపించారు. సర్వమత సమానత్వం, ఐక్యతభావం పెంపొందించే విధంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. వాక్య పరిచయం చేశారు. కేక్ కోసి క్యాండిల్ సర్వీస్ చేశారు. డేవిడ్, రవి, కుమార్, నాగేశ్వరరావు, పీవీ తులసీరాం, తొగురు సత్యనారాయణ, బత్తుల సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.