Home ప్రకాశం ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు

ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు

280
0
  • నకిలీ నియామక పత్రంతో మెసపోయిన బాధితుడు
  • వాడరేవు మాజీ ఎంపిటిసి రూబెను పోలీసులకు పిర్యాదు
  • అరెస్టు వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ మల్లికార్జునరావు


చీరాల : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చీరాల పట్టణం శృంగారపేటకు చెందిన వైసిపి సోషల్ మీడియా కార్యకర్త యాతం క్రాంతి తన వద్ద లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఇతని చేతిలో మోసపోయిన చీరాల మండలం వాడరేవు మాజీ ఎంపిటిసి జాలె రూబేను పోలీసులకు పిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా యాతం క్రాంతిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు చీరాల రూరల్‌ సిఐ మల్లికార్జునరావు తెలిపారు.

స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సిఐ మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు. చీరాల మండలం వాడరేవుకు చెందిన మత్స్యకారుడు జాలె రూబేన్ అనే వ్యక్తి కుమారుడికి బ్యాక్ లాగ్ పోస్టు ఇప్పిస్తానని పేరాలకు చెందిన యాతం క్రాంతి అనే వైకాపా సోషల్ మీడియా కార్యకర్త రూబేన్‌ను నమ్మబలికాడని తెలిపారు. ఇది నిజమని అనుకుని అతని మాయలో పడిన రూబేన్ సుమారు రూ.4.50 లక్షల వరకు నగదును క్రాంతికి విడతలవారీగా ఇచ్చాడని పిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోవటంతో క్రాంతిని ప్రశ్నించాడు. ఆ తర్వాత ఉద్యోగ నియామక పత్రాన్ని ఇచ్చాడు. ఇది నఖిలీ పత్రమని తెలుసుకున్న రూబేన్ ఏప్రిల్ 26న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం యాతం క్రాంతిని అరెస్టుచేసినట్లు సిఐ తెలిపారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరచినట్లు సీఐ చెప్పారు. ఇదిలా ఉండగా క్రాంతి బాధితులు మండలంలో అనేకమంది ఉన్నట్లు తెలిసింది. అయితే ఫిర్యాదు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో బాధితుల వివరాలును పోలీసులు సేకరిస్తునట్లు తెలిపారు.