చిత్తూరు : దారుణ హత్య కు గురైన ఐదేళ్ల చిన్నారి వర్షిత కుటుంబాన్ని తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు గ్రామానికి వెళ్ళి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అక్కడే ఉన్న దర్యాప్తు అదికారి మదనపల్లి రూరల్ సిఐని అడిగి అదృశ్యమైన వెంటనే సిసి టివి పుటేజిని పరిశీలించార లేదా అని అడిగారు. సిసి టివి పుటేజిని పరిశీలించిన తరువాత ఒక వ్యక్తి ఆ పాపని ట్రాప్ చేసి బయటకి తీసుకువెళ్లడం ఏమాత్రం జంకు లేకుండా పాపను తీసుకెళ్లిన దృశ్యాలను చూసిన తరువాత ఆ వ్యక్తి ఇలాంటి నేరాలు చెయడానికి అలవాటుపడిన దుర్మార్గుడులా కనిపిస్తున్నాడని వెంటనే పట్టుకోవాలని కోరారు.
అనంతరం జిల్లా ఎస్పితొ మాట్లాడి ఇటువంటి కేసులు ఛేదించిన అనుభవం వున్న సాంకేతిక నిపుణులను తక్షణం సంప్రదించాలని, నిందితుడు దొరికేవరకు పట్టువిడువరాదని ఎస్పిని కోరారు. ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడి ఈ దారుణ సంఘటనను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి పోలీసు ఉన్నతాధికారులతో తక్షణమే మాట్లాడించాలని కోరారు. అవసరమయితే కొత్త పద్దతులను అన్వేషించి నిందితుడుని పట్టుకోవాలని అన్నారు. ఆ గ్రామ ప్రజలు, మహిళలు, స్కూలు విద్యార్థులు, ఉపాద్యాయులు, ప్రజా సంఘాల నేతలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆమె వెంట తంబళ్లపల్లి ఎంఎల్ఎ పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి ఉన్నారు.