చాగల్లు : పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటున్న చాగల్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్
గాది సుబ్బారావుని ఎసిబి అధికారులు పట్టుకున్నారు. చాగల్లు మండలం ఎస్ ముప్పవరం గ్రామానికి చెందిన అయినం దుర్గ ప్రసాద్ కి చెందిన 1.75 ఎకరాల పొలానికి సంభందించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఆర్.ఐ సుబ్బారావు నగదు డిమాండ్ చేశాడు. చాగల్లు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.