Home ప్రకాశం భావి ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్య స్ఫూర్తి : జెవివి

భావి ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్య స్ఫూర్తి : జెవివి

319
0

చీరాల : ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య తన మేధస్సును ఉపయోగించి సహజ వనరులను అందుబాటులోకి తేవడానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన చేసిన కృషి వల్లనే దేశంలోని జలవనరుల సద్వినియోగం జరిగిందని రైతాంగాయానికి సాగునీరు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. నేటి తరం భావి ఇంజనీర్లు కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం తమ మేధస్సును వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో జేవివి చీరాల డివిజన్ నాయకులు డి నారపురెడ్డి, అదిశంకరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీబాష, యూటీఎఫ్ చీరాల పట్టణ కార్యదర్శి కుర్రా శ్రీనివాస్, నాయకులు రాజేష్, జాగర్లమూడి వెంకటేశ్వర్లు, ప్రసన్న, సీఐటీయూ నాయకులు నలతోటి బాబురావు పాల్గొన్నారు.