Home ప్రకాశం వేటపాలెంలో ఎఎంసి ఆధ్వర్యంలో జనతా రైతుబజార్ కూరగాయల విక్రయం

వేటపాలెంలో ఎఎంసి ఆధ్వర్యంలో జనతా రైతుబజార్ కూరగాయల విక్రయం

279
0

చీరాల : కరోనా లాక్ డౌన్ పొడగింపు కారణము కారణంగా పనులు లేక ఇబంది పడుచున్న పేదలకు తక్కువ ధరకు కూరగాయలు పంపిణీచేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వైయస్సార్ జనతా రైతు బజార్ నామకరణ చేశారు. మన జిల్లాలో ఏఎంసీ ఆధ్వర్యములో వైసిపి చీరాల నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణ మోహన్ చే మహిళా సమాఖ్య ద్వారా రూ.100లకే 11రకాలైన కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వేటపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ విగ్రహము వద్ద బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమములో ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగొరీ, ఏపీఎం గంట శ్రీనివాసరావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సీతారావమ్మ, ఏఎంసీ సిబంది, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.