హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటన ఖారారైంది. ఆదివారం కేసీఆర్ తిరుపతి వెళ్తారని సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువరించారు. కేసీఆర్తో పాటు మరెవరైనా వెళ్తారా లేక ఒక్కరే వెళ్తారానే విషయం తెలియాల్సి ఉంది.
గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే. స్వామివారిని దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు ఆభరణాలను సమర్పిస్తానని మొక్కుకున్న కేసీఆర్ రూ.5కోట్లతో బంగార ఆభరణాలు తయారు చేయించారు.
కేసీఆర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు కలిసి రెండు ప్రత్యేక విమానాల్లో అప్పట్లో తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు