Home విద్య టీఆర్ఆర్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల వితరణ

టీఆర్ఆర్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల వితరణ

449
0

కందుకూరు : 100 సంవత్సరాల వేడుకలలో భాగంగా బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు టీఆర్ఆర్ డిగ్రీ 1994-1997 బ్యాచ్ విద్యార్థులు రూ.30వేల విలువైన‌ స్పోర్ట్స్ యూనిఫామ్‌ను పాఠశాల విద్యార్ధుల‌కు అందజేశారు. ప్రధానోపాధ్యాయుని శ్యామల కుమారికి రిసోర్స్ ప‌ర్స‌న్‌ పసుపులేటి పాపారావు, తానికొండ హరిబాబు, గోనుగుంట కృష్ణా రావు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని శ్యామలా కుమారి మాట్లాడుతూ పాఠశాలకు దాతలు పలువిధాలుగా సహయ‌పడుతున్నారని పేర్కొన్నారు. టిఆర్ఆర్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థులు సహకారం అందించండి ఎంతో సంతోషంగా ఉందన్నారు.

పసుపులేటి పాపారావు మాట్లాడుతూ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులమైన మేము డిగ్రీ చదివిన విద్యార్థులతో కలిసి త‌మ‌వంతు సహాయం అందజేసామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి త‌మ‌ మిత్ర బృందం సిద్ధంగా ఉందన్నారు. పాఠ‌శాల‌ శ‌తాబ్ది ఉత్స‌వాలు విజయవంతం చేయడంలో త‌మ‌ మిత్రులందరి సహకారం మరువలేనిదన్నారు. అదేవిధంగా సహకారం అందించిన మిత్రులు అందరికి పేరు పేరు న కృతజ్ఞతలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పాఠశాల ఉపాధ్యాయుని ఆకుల పార్వతి, పీడీ రాజ్యలక్ష్మి, పిఈటి కౌసల్య పాల్గొన్నారు.