Home ఆధ్యాత్మికం ఇఒ తిమ్మనాయుడు, రిషిత దంపతుల ప్రత్యేక పూజలు

ఇఒ తిమ్మనాయుడు, రిషిత దంపతుల ప్రత్యేక పూజలు

46
0

అద్దంకి : సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామి విమాన శిఖరానికి 108 కలిశాలతో మంగళవారం అభిషేకం వేద పండితులు, అర్చకులు, ముత్తైదువులు పాల్గొని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఇఒ మదమంచి తిమ్మనాయుడు, రిషిత దంపతులు విమాన శిఖరానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు శిఖరానికి గుండ్లకమ్మ నది నుండి తీసుకువచ్చిన జలాలను విమాన శిఖరంపై వేద పండితులచే అభిషేకం జరిపారు.
రాఖీ ముఖ మండప దాతలకు ప్రత్యేక పూజ
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి రాతి ముఖ మండప నిర్మాణానికి విరాళాలు అందించిన దాతల దంపతులకు ప్రత్యేక పూజలు స్వామి వారి వద్ద నిర్వహించారు. అనంతరం స్వామి వారి చిత్రపటానికి కార్యనిర్వహణ అధికారి తిమ్మనాయుడు వారికి అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
కలశ యాత్ర మహిళలకు ప్రత్యేక దర్శనం
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కలశ పాదయాత్రలో గుండ్లకమ్మ నది నుండి సింగరకొండ వరకు పాదయాత్రలో పాల్గొన్న మహిళా భక్తులకు స్వామి వారి ప్రత్యేక దర్శనం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏర్పాటు చేశారు. పాదయాత్రలో పాల్గొన్న మహిళా భక్తులు నియోజకవర్గం, ఇతర మండలాల నుండి వచ్చిన భక్తులకు విమాన శిఖర దర్శనం ఏర్పాటు చేసి స్వామి వారి దర్శనం అనంతరం అన్న వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు.