ప్రకాశం : జిల్లాలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుంది. సుదూర ప్రాంత ప్రజల సౌకర్యార్దం, వ్యయ ప్రయాసలను దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లా ఎస్సి శిద్దార్ధ్కౌశిల్ ప్రజలు ప్రతి సోమవారం మధ్యానం 01.00గంట నుండి 03.00గంటల వరకు వేటపాలెం పోలీస్ స్టేషన్లోని వీడియో కాన్ఫరెన్సు ద్వారా నేరుగా ఎస్పితో సమస్యలను తెలిపినట్లయితే ఎస్పి స్పందనగా నమోదు చేసి పరిష్కరిస్తారని ఎస్ఐ వి అజయ్బాబు తెలిపారు. వేటపాలెం ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.