Home ఆంధ్రప్రదేశ్ స్నేహలత హంతకులను శిక్షించాలి : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి

స్నేహలత హంతకులను శిక్షించాలి : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి

321
0

అనంతపురం : దళిత యువతి స్నేహలతను హత్య చేసిన ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతపురంలో స్నేహలత తల్లిదండ్రులు లక్ష్మీదేవి, కుళ్లాయప్పలను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముద్దాయిలకు శిక్ష పడేవరకు బాధితులకు అండగా ఉంటామన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట కెవీపియస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, నల్లప్ప, నగర నాయకులు వెంకటేష్, జీవరత్నం, ఆదినారాయణ, లక్ష్మినారాయణ, నాగేంద్రం, వరలక్ష్మి, రాజా, ఎర్రిస్వామి, నాగభూషణం ఉన్నారు.