Home ప్రకాశం ఆపదలో ఉన్న పేదలకు సహాయం చేయడమే రోటరీ లక్ష్యం : బండారు హేమంత్ కుమార్

ఆపదలో ఉన్న పేదలకు సహాయం చేయడమే రోటరీ లక్ష్యం : బండారు హేమంత్ కుమార్

384
0

చీరాల : విపత్కర పరిస్థితుల్లో పేదలకు ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో రోటరీ క్లబ్ క్షీరపురి ఆధ్వర్యంలో అడ్డగడ్డ మల్లికార్జున్ సహకారంతో వేటపాలెం మండలం కటరిపాలెం యనది కాలనీ, వేటపాలెం కాలవకట్ట దగ్గర ఉన్నటువంటి నిరుపేదలకు, దేశాయిపేట యానాది కాలనీ ప్రజలు 350మందికి కిచిడి రైస్ పాకెట్స్, పెరుగు పంపిణీ చేశారు.

న్యాయవాది బండారు హేమంత్ కుమార్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ప్రతినిధులు చేస్తున్న సేవలు అట్టడుగు నిరుపేదలకు అందుతూ ఉన్నాయని అన్నారు. ఇతరులు కూడా ఇలాంటి సేవలు అందించాలని కోరారు. అడ్డగడ్డ మల్లికార్జునరావు, కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు మాట్లాడుతూ చీరాలలో ఉన్నటువంటి ప్రముఖులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు పేద ప్రజలకు ఆకలి బాధలు లేకుండా చూడాలని కోరారు. పేదలకు సేవ చేయడానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ క్షిరపురి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్డగడ్డ మల్లికార్జున్, ప్రెసిడెంట్ రావి వెంకటరమణ, డాక్టర్ విజయకుమార్, రామకృష్ణ, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ మార్కెటింగ్ మేనేజర్ ఆకురాతి రేవంత్, పేరాల శివాలయం యూత్ నరేంద్ర, మురళి, వంశీ, పేరాల శివాలయం మేనేజర్ శివనాగదాసు పాల్గొన్నారు.