Home ప్రకాశం జర్నలిస్టులకు రూ.25వేల విలువ చేసే బియ్యాన్ని పంపిణీ చేసిన డేవిడ్ రాజు

జర్నలిస్టులకు రూ.25వేల విలువ చేసే బియ్యాన్ని పంపిణీ చేసిన డేవిడ్ రాజు

400
0

టంగుటూరు : కోవిడ్19 కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు తనవంతు చేయూతగా రూ.25వేల విలువ కలిగిన నాణ్యమైన బియ్యాన్ని ఒక్కొక్క జర్నలిస్టుకు 25కేజీల బియ్యం బస్తాను వైస్సార్ సీపీ మండల నాయకులు, సహకార సంఘ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట హరిబాబు చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా డేవిడ్ రాజు మాట్లాడుతూ కరోనా కారణంగా లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్కువ జీతంతో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, 400మంది ఉపాధి కూలీలకు మాస్క్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా అత్యవసర సమయంలో సైతం సమాచారాన్ని సేకరించి ప్రజలకు, ప్రభుత్వానికి తెలియపరుస్తు జీతం లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టుల ఆర్థిక ఇబ్బందులను గమనించి బియ్యం పంపిణీ చేస్తున్నట్లు డేవిడ్ రాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకులు దండాల వినోదం, కెనరా బ్యాంక్ మేనేజర్ లామా చిరంజీవి, డేవిడ్ రాజు తనయులు హేమంత్ రాజు, శ్రీకాంత్ రాజు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.