చీరాల : ఓటర్ల ఎన్రోల్మెంట్పై ఆర్డీఒ టి చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని 218 బూతుల్లో సౌకర్యాలు, అసౌకర్యాలు, బూతుల్లో ఓటర్ల సంఖ్య, కొత్తగా ఓటర్ల చేర్పులు, మరణించిన వారిని తొలగించుట, ఇప్పటివరకు నియోజకవర్గంలో 98,860 పురుషులు, 1,04,094 మహిళలు, 87 థర్డ్ జెండర్ కలిపి 2,02,977 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రానున్న కాలంలో ఈ ఓటర్ల సంఖ్య ఇంకా పెరుగుతారని అన్నారు. అందుకు అనుగుణంగా పోలింగ్ బూతుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు ఏదైనా అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని కోరారు. సమావేశంలో తహశీల్దారు గోపికృష్ణ, తెలుగుదేశం ప్రతినిధి గజవల్లి శ్రీనివాసరావు, కీర్తి ప్రసాద్, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, బిజెపి నాయకులు పింజెల భరణిరావు తడవత్తి చంద్ర, లిబరేషన్ కాంగ్రెస్ నాయకులు శీలం రవి, బీఎస్పీ నాయకులు సిర్రా భగత్ సింగ్, కాంగ్రెస్ నాయకులు మల్లెల బుల్లిబాబు పాల్గొన్నారు.