బాపట్ల (DN5 News) : తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ నిజాం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ, ఇఫ్తార్ విందులో శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పోరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ముస్లిం పేదలకు రంజాన్ తోఫా అందజేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.






