కొండేపి : వైఎస్ఆర్సిపి కొండేపి నియోజకవర్గ నాయకులు వరికూటి అశోక్ బాబు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. జిల్లాలోని వివిధ ప్రజాసంఘాల నాయకులు, కొండెపి నియోజకవర్గం లోని వివిధ గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ట్రాక్టర్లు, ఆటోళ్లలో వచ్చి పెద్దసంఖ్యలో దీక్షా శిభిరం వద్దకు వచ్చి అశోక్ బాబుకు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపినవారిలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు విజయేంద్ర బహుజన్, దళిత సాహిత్య వేత్తల రాష్ట్ర అధ్యక్షులు మన్నం ప్రసన్నకుమార్ రాజు, ముస్లీం మైనార్టీల ఐక్యవేదిక జిల్లా నాయకులు కాలీషా బేగ్, సీపీఐ టంగుటూరు మండల నాయకులు టి ప్రభాకర్ వున్నారు.