Home ప్రకాశం తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారం : డాక్టర్ వెంకయ్య

తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారం : డాక్టర్ వెంకయ్య

412
0

టంగుటూరు : మండలంలోని కారుమంచి గ్రామ సభలో వైసీపీ కొండపి ఇన్ చార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవరత్నాలు కుల, మతాలకు సంబంధం లేకుండా అర్హులైన అందరికి అందించడమే లక్ష్యమని చెప్పారు. కారుమంచిలో త్రాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చేసి నీరందిస్తామన్నారు. ఎమ్మెల్యే స్వామి ఉదాసీనతతో కారుమంచికి త్రాగునీటి సమస్య వచ్చిందన్నారు. ఇళ్ళ స్థలాలు లేని పేదల నుండి దరఖాస్తులు స్వీకరించారు. డ్వాక్రా గ్రూపుల రుణ మాఫి పత్రాలును విడుదల చేశారు.

కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్లా రామారావు, నాయకులు అయ్యవారయ్య, సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి, సూరం రమణారెడ్డి, సూదనగుంట శ్రీహరి, ఎం కోటిరెడ్డి, ఈదా వెంకటరెడ్డి, సిఐ టీఎక్స్ అజయ కుమార్, ఎస్ఐ రమణయ్య, ఈ ఓఆర్డీ, విఆర్వో మధు, ఏపీఎం రాజారావు, జెఈ సుబ్బరావు పాల్గొన్నారు.