టంగుటూరు : మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం 141మంది కొత్త ఒంటరి మహిళా పెన్షన్ దార్లకు పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హలైన ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేసినట్లు ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అర్హులు ఎవ్వరైనా ఉంటే ధరకాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సి హనుమంతరావు, బెల్లం జయంత్ బాబు, జెడ్పిటిసి పటాపంజుల కోటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ శైలజ, టిడిపి మండల అధ్యక్షులు కామని విజయకుమార్, టిడిపి సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.