Home ఆంధ్రప్రదేశ్ కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

188
0

జనం కష్టాలు వింటే నాయకుడి గుండె కరగాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాగే స్పందించారు. జనం చెప్పుకునే కష్టాలు విని ఉద్వేగానికి గురయ్యారు. <span;>వారాహి యాత్రలో భాగంగా జనసేనాని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ నిర్వహించిన జనవాణి లో <span;>ఓ దివ్యాంగుడి ఆక్రందనకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చలించిపోయారు. దీంతో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. జానవాణిలో దివ్యాంగుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఓ తల్లి తన దివ్యాంగుడైన కొడుకును తీసుకొచ్చి వారి సమస్యను పవన్‌కు ఏకరువు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం తమ పెన్షన్ తీసేసి వేధిస్తోందని పవన్‌కు ఆమె మొర పెట్టుకుంది. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని పింఛన్ కట్ చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పరిణామంతో పవన్ కూడా చలించి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంది. దీంతో పవన్.. ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాచారు. అన్ని విధిలా ఆదుకుంటానని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు.