Home ప్రకాశం ఔట్సోర్సింగ్ సిబ్బంది బిక్షాటనకు సిద్ధం

ఔట్సోర్సింగ్ సిబ్బంది బిక్షాటనకు సిద్ధం

79
0

– ఒంగోలు నగరపాలక సంస్థలో కార్మికుల దుస్థితి       – కార్మికులను గాలికొదిలేసి ఎమ్మెల్యే                           – ఎంఎల్ఎ వంత పాడుతున్న కార్మికనాయకులు       – తమకు న్యాయం చేయాలని కోరుతున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది.

ఒంగోలు (DN5 News) : పెద్ద మెజారిటీతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఒంగోలు లోను శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ గెలిచిన తర్వాత ఆయన తీరు మారినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. తన వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒంగోలు నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఔట్సోర్సింగ్ కింద శానిటేషన్ మేస్త్రీలుగా పనిచేస్తున్న 100 మందిని తొలగించారు. వారి స్థానంలో తనవారిని చేర్చుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని, కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించడానికి వీలు లేదని ఔట్సోర్సింగ్ జీవోలో ఉన్నది. అందువల్లనే గత ప్రభుత్వంలో కూడా వైసీపీ శాసనసభ్యులు చెప్పినప్పటికీ సిబ్బందిని తొలగింపు ప్రక్రియ జరగలేదు. అడపాదడపా ఒకరినో ఇద్దరినో తొలగించిన సందర్భాలు తప్ప పెద్ద సంఖ్యలో తొలగించిన దాఖలాలు లేవు. కొన్ని సందర్భాల్లో తొలగిస్తే హైకోర్టు ద్వారా తిరిగి ఔట్సోర్సింగ్ సిబ్బందిగా తీసుకొనడంతో పాటు తొలగించినప్పటి నుంచి జీతాలను కూడా చెల్లింపు చేసిన సందర్బాలు ఉన్నాయి. ఇటీవలనే ఒంగోలులో ఆరోగ్య శాఖ సిబ్బందిని తొలగిస్తే వారు కూడా కోర్టు నుంచి ఉత్తర్వులు పొందారు. అయినప్పటికీ నగరపాలక సంస్థ 100 మంది శానిటేషన్ అవుట్సోర్సింగ్ మేస్త్రీలను తొలగించినప్పటికీ కార్మిక సంఘాలు మౌనంగా ఉండటం చుస్తే రాజకీయ జోక్యం ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అంతేకాకుండా కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది. కార్మికుల హక్కులను కాపాడటానికి అవకాశం ఉండి కూడా కిమ్మనకుండా ఉండటంలో జరిగిన మతల భేమిటో కార్మిక నాయకులే చెప్పాలి. శాసనసభ్యుల తన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించుకోవాలనుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ బంతిలో కూర్చుని తింటున్నటువంటి సానిటరీ మేస్త్రీల పళ్లేలు లాగేసి వేరే వారికి ఇవ్వడం ఎంతవరకు న్యాయమో వారే చెప్పాలి. గతంలో టిడిపి శాసనసభ్యులు గత వైసిపీ శాసనసభ్యులు 200 మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకున్నారు. కానీ ఏ ఒక్కరిని తొలగించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరో ముఖ్య విషయం వందమంది ఔట్సోర్సింగ్ మేస్త్రీలను తొలగిస్తే దానిలో 35 మంది వరకు గతంలో టిడిపి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్న జనార్ధన హయాంలో పనిచేసిన వ్యక్తులే కావడం ఆశ్చర్యకరం కలిగించే అంశం.

దీనిపై ఆ మేస్త్రీల బాధ వర్ణనాతీతం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగం పొంది శానిటరీ మేస్త్రిలుగా తాము మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినందుకు ఆనందించాలా లేదా తమ ఉద్యోగాలు తొలగించి తమ పొట్ట కొట్టినందుకు శాపనార్థాలు పెట్టాలా అని వాపోతున్నారు. ఆ 35 మందిని తొలగించడం వెనక డబ్బులు చేతులు మారాయా?, సామాజిక వర్గాలు నచ్చలేదా? స్థానికంగా ఉండే చోటామోటా నాయకుల ఒత్తిళ్లు పనిచేశాయా? ఏమిటనేది శాసన సభ్యులు చెప్పాలి.

ఇంత జరుగుతున్న ఏది అడిగినా తనకేమీ పట్టనట్టు మున్సిపల్ కమిషనర్ వ్యవహారించడం సిబ్బందికి అబద్రత కలిగించింది. చేయాల్సిన పనులకు నీళ్లు వదిలి తన సొంత లాభం చూసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు పనులు తనకు సంబంధించిన నరసాపురం కాంట్రాక్టర్లకు అప్పచెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అర్హత లేని వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించిన విషయంపై రాష్ట్ర హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఇప్పుడు తొలగించిన కార్మికులు కూడా కోర్టుకు వెళితే ఈ రెండు విషయాలలో మున్సిపల్ కమిషనర్ పీక ల్లోతు మునిగిపోక తప్పదు. ప్రభుత్వం, నాయకులు, డబ్బులు ఏవి కాపాడలేవు.

మొత్తం మీద 100 మంది మేస్త్రీలను రోడ్డున పడేసిన ఘనత, అందులోనూ 35 మంది తన హయాంలో తీసుకున్న మేస్త్రీలనే తొలగించిన ఘనత కూడా దామచర్ల జనార్ధనకి దక్కుతుంది. కాంట్రాక్టు సిబ్బంది తొలగింపు ఫలితాలు భవిష్యత్తులో తప్పకుండా ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు. దీనికి బాధ్యత వహించవలసిన మున్సిపల్ కమిషనర్ నోరు మెదపకపోవడం, కోర్టు వెళ్లడానికి అవకాశం ఉండి, ఒత్తిడి తేవడానికి అవకాశం ఉన్నప్పటికీ కార్మికుల పక్షాన కార్మిక సంఘాలు మాట్లాడ కపోవటం, వైసీపీతో సహా జనసేన కానీ ఏ ఒక్కరూ ఈ తొలగింపుపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం. తొలగించిన వారి స్థానంలో కొత్తవాళ్లను తీసుకోవడంలో చోటామోటా నాయకులు చెప్పిన వాళ్లకు ఇస్తున్నారు. వీటన్నింటిలోనూ శాసనసభ్యుల పిఎలదే పెత్తనం అనేది సర్వత్ర వినిపిస్తోంది. కనుక శాసనసభ్యులు జనార్ధన్ నిండు మనసుతో ఆలోచించి దీనికి సరైన పరిష్కారం కనుగొని కార్మికుల జీవితాల్లో వెలుగును నింపాలని కోరుతున్నారు.