Home వైద్యం కిడ్నీ వ్యాధులపై చీరాల శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో సదస్సు

కిడ్నీ వ్యాధులపై చీరాల శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో సదస్సు

382
0

చీరాల : ప్రకాశం జిల్లా చీరాల శ్రీ‌కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవ‌ర‌ణ‌లో విజ‌య‌వాడ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వ‌హించారు. స‌ద‌స్సులో డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందనే అంశంపై క్లుప్తంగా వివరించారు. కిడ్నీ వ్యాధి నుండి ఏ విదంగా బయటపడల‌నేదానిపై కూడా వివరణ ఇచ్చారు. రోగులు అడిగిన సమస్యలకు సమాధానం చెప్పారు.

అనంతరం ఉచితంగా స్క్రినింగ్ టెస్ట్ లు చేశారు. కిడ్నీ వ్యాధికి సంబంధించి విజయవాడ, గుంటూరు వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్రతి మంగళవారం చీరాల శ్రీ‌కామాక్షి కేర్ హాస్పటల్ లో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్ట‌ర్‌ శ్రీకాంత్ రెడ్డి, మేనేజ‌ర్ ధనుంజ‌య‌ పాల్గొన్నారు.