టంగుటూరు (దమ్ము) : దళితులను ఉద్ధరిస్తానని దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దళిత విద్యార్థులకు అమలులో ఉన్నపధకాలను రద్దు చేస్తూ పోతున్నాడని టీడీయల్ పి విప్, టీడీపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఇంతకుముందున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పధకాన్ని రద్దుచేశారని అన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పధకాన్ని రద్దుచేశారని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు నాలుగు జతల యూనిఫామ్ ఇస్తుంటే జగనన్న విద్యాకానుక పధకం వల్ల అధికాస్తా మూడు జతలకు కుదించారని చెప్పారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసెస్ మొదలయ్యి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు యూనిఫామ్ ఒక్క జత కూడా ఇవ్వలేదన్నారు.
అమ్మఒడి పుణ్యాన ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలల్లో చదువుతుంటే ఇద్దరికి ఇవ్వవలసిన కాస్మోటిక్ చార్జీలను ఒకరికి మాత్రమే చెల్లించడం మేనమామగా చెప్పుకునే జగన్ రెడ్డి దళితులపై చూపే వివక్షకు నిదర్శనమన్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంకేమ గురుకుల పాఠశాలల్లో జూనియర్ ఇంటర్ లో షుమారు 1000 సీట్లను రద్దుచేశారని చెప్పారు. అంటే వచ్చే విద్యా సంత్సరంలో 2000 మంది దళిత విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. సింగరాయకొండ గురుకుల పాఠశాలలో జూనియర్ ఇంటర్ లో సైన్స్ గ్రూప్ కి చెందిన 80సీట్లు రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. ఇది దళితులపై కపట ప్రేమను ఒలకపోస్తూ పేద దళితులను మోసం చేయడం కాదాని జగన్ రెడ్డిని ప్రశ్నించారు. నిన్న క్రిస్మస్ కానుకగా ప్రైవేట్ కాలేజ్ ల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు విద్యాకానుక, వసతి దీవెనను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులివ్వడం పేద ప్రజలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను దూరం చేయడం కాదాని జగన్ రెడ్డిని ప్రశ్నించారు. నిజంగా మీరు పేద విద్యార్థులకు న్యాయం చేయాలనుకుంటే ప్రైవేట్ పీజీ సెంటర్స్ లో పేదలకు ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో అన్ని సీట్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో పెంచాలన్నారు. దళితులు, పేదలు వృద్ధి చెందాలనే అభిలాష జగన్ కు ఉంటే పైన చెప్పిన పధకాలన్నింటిని పునరుద్ధరించాలని లేకుంటే దళిత జాతి ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు.