బాపట్ల : శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 2వ వార్డులో మంగళవారం పర్యటించారు. ప్రజల దైనందిన సమస్యలు నేరుగా పరిశీలించి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు విని తక్షణమే చర్యలు తీసుకునే విధంగా అధికారులతో సమన్వయం చేసి ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలోని 5వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి గారు, మునిసిపల్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, సందు సాంబశివరావు, అంకాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.