చీరాల : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో షుగరు వ్యాధికి ఉచిత వైద్య శిభిరం ఆదివారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వేకువ జాము నుండే వచ్చిన 1178 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. నెల రోజులకు సరిపడు మందులు ఉచితంగా అందజేసినట్లు ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్ తెలిపారు. శిభిరానికి హాజరైన వారందరికి అల్పాహారం, తాగునీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేశారు. షుగర్ వ్యాధి బాధితులు ఎక్కువ సమయం వేచి ఉండ కుండా వేగంగా వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి త్వరగా పరీక్షలు చేసినట్లు తెలిపారు. విస్తృత ఏర్పాట్లతో మధ్యాహ్ననికే వచ్చిన వారందరికీ వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా రోగులకు షుగరు వ్యాధిపై అవగాహన కల్పించారు. రోజువారీ జీవన విధానం మార్చుకోవాలని సూచించారు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుందని చెప్పారు. మానసిక ఆందోళన తగ్గించుకోవాలని చెప్పారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని చెప్పారు.
వైద్య శిభిరంలో డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్ కమలా రాజేశ్వరి, డాక్టర్ లలిత్ ప్రకాష్, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ ప్రకాష్ వైద్య పరీక్షలు చేశారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, సాయి ఫణికిషోర్, చందన, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, బసవరావు, కుమార్, ఎ సురేష్, మిత్ర ల్యాబ్ వలి, గోపాల్, వాడరేవు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతులు, సహాయక ఏర్పాట్లు చశారు.